Posts

Showing posts from May, 2026

కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ

Image
 కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ 👉వేసవిలో కుక్కల దాహం తీర్చితే కరుస్తాయనే భయం లేదు, ప్రకృతి ఆగ్రహించకుండా జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం... బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 17/05/'26.      మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ వారు రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన ఎల్.బి.నగర్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేయడమైనది. తేది: 19/04/'26న శ్రీ వెంకటేశ్వర కాలని గణేష్ మండపం, 26/04/'26న హుడాసాయినగర్ కమ్యూనిటీ హాల్, 17/05/'26న నాగోల్ కమ్యూనిటీ హాల్ మరియు సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలు వేదికలుగా పంపిణీ చేయడమైనది. గత రాత్రి నాగిరెడ్డి కాలనీలో చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎన్.రెడ్డి డివిజన్ మాజీ కార్పోరేటర్ మాట్లాడుతూ కుక్కలు సహజంగా విశ్వాస జంతువులని, సృష్టి లోని ప్రతి జీవి కనీస అవసరం ఐన నీరు, ఆహారం అందిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనుషులదే అని, ప్రకృతిలో భాగమైన కుక్కలకు దాహం వేసిన సందర్భాల్లో నీళ్ళు దొరకక అసహనంతో ఆగ్రహానికి గురై మనుషులను ...

మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం

Image
 మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం మల్కాజ్ గిరి పోలీస్ కమీషనరేట్ కు నియమితులైన మొదటి మహిళా కమీషనర్ శ్రీమతి బి.సుమతి IPS బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధరాత్రి దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో సాధారణ మహిళ వస్త్ర ధారణతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కారణంగా ఆడవాళ్ళను వేధించే 40మంది పోకిరీలను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సహజంగా సినిమాల్లో మాత్రమే చూసే ఈ డ్రైవ్ నిజ జీవితంలో జరగడం రాత్రి సమయంలో బిక్కు మంటూ అభద్రతా భావంతో విధులు నిర్వహించే మహిళల్లో ఆత్మ స్ధైర్యాన్ని పెంచుతుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ డ్రైవ్ పెద్ద భరోసానిస్తుందని భావిస్తూ ప్రజల తరపున నేడు జాగృతి అభ్యుదయ సంఘం టీం మల్కాజ్ గిరి లోని CP కార్యాలయంలో CP సుమతిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదని, తన పరిధిలోని అనుమానిత ప్రాంతాలలో తరచూ ఇలాంటి డ్రైవ్ లు కొనసాగిస్తామని, తన కమీషనరేట్ పరిధిలోని ప్రతి కుటుంబం క్షణ క్షణం భయపడే పరిస్థితి లేకుండా భరోసాతో సంతోషకర జీవితాన్ని గడిపేవిధంగా టెక్నాలజీ ఆధారిత "సురక్షా...

ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి

Image
 ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి మంచి అలవాట్ల వైపు ప్రజలను ఆకర్షింప చేసేందుకు ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తూ...  హానికారక/ప్రభుత్వ నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువులను దేవాలయాలకు, ప్రార్ధనా మందిరాలకు తాత్కాలికముగా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గౌ|| పర్యావరణ, అటవీశాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ ను సచివాలయం లోని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇవ్వడమైనది. మంత్రిగారు సానుకూలంగా స్పందించారు.  ఈ ప్రక్రియ ప్రజల్లో నిజమైన భక్తి భావన పెరగడానికి దోహదపడుతుందని, పలుచని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లలో టెంకాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితర పూజా ద్రవ్యాలు, ప్రసాద సామాగ్రి దేవాలయ ప్రాంగణాల్లోకి తీసికెళ్ళడం తగ్గుముఖం పడుతుందని, దేవాలయాల్లో జరిగే అన్నదానాల ప్లేట్లు, ప్రసాదాల పంపిణీకి వినియోగించే ప్లాస్టిక్ డొప్పలు, స్పూన్లు వాడకం తగ్గుతుందని జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్, శ్రీరంగనాథ్ లు ఆశాభావం వ్యక్తం చేశారు.  పరిమితమౌతున్న ప్ర...