ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ
*ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ* సాహెబ్ నగర్, వనస్థలిపురం, ఏప్రిల్ 21: ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జాగృతి ప్రతినిధులు పాల్గొన్న ఈ మెగా ర్యాలీని హయత్ నగర్ మండల విద్యా శాఖాధికారి (MEO) కె.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ సైకిల్ ర్యాలీ కేవలం పొల్యూషన్ తగ్గించడమే కాకుండా భూమాత సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, చెట్ల పెంపకం, సహజ ఎరువులుతో భూసారం పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగృతి అభ్యుదయ సంఘం సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. పలు పర్యావరణ పరిరక్షణ నినాదాల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ షుమారు 150మంది విద్యార్థులు పాల్గొన్న మెగా సైకిల్ ర్యాలీ NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై రైతు బజార్, గణేష్ టెంపుల్, రెడ్ వాటర్ ట్యాంక్,...