DEC 2.2023 ANTI POLLUTION DAY


                               ANTI POLLUTION DAY WITH VOO KIDZ SCHOOL CHILDRENS







 కాలుష్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పర్యావరణ ర్యాలీ

  డిసెంబర్ 2 Anti Pollution Dayను పురస్కరించుకుని బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ నందలి ఊ కిడ్స్(Voo Kidz)స్కూల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులచే పర్యావరణ ర్యాలీ నిర్వహించారు. బ్యాంక్ కాలనీ మరియు జక్కిడి నగర్ కాలనీ వీధుల్లో జరిపిన ర్యాలీకి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మధ్యప్రదేశ్ భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన రోజు అని,  ప్రమాదం కారణంగా షుమారు 15వేల మంది ప్రజలు ఆ విషవాయువు లను పీల్చి నిద్రలోనే చనిపోయారన్నారు. భవిష్యత్ లో ఇటువంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా పరిశ్రమల యాజమాన్యాలకు,ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ తేదీని Anti Pollution Day గా జరుపుకోవడం మొదలైందన్నారు.

విష వాయువులను నిలువరించే ఔషధ మొక్కలు ప్రతి ఇంటి పెరట్లో పెంచుకోవడం అలవాటుగా చేసుకోవాలన్నారు. ప్రతినిత్యం ఔషధీయ సమిధలు, ఆవు పిడకలతో అగ్నిహోత్రం చేసుకోవడం ద్వారా విషవాయువులు, వైరస్ లు,  దోమలు,ఈగలు లాంటి వ్యాధికారక క్రిముల దాడినుంచి బైటపడగలమని అన్నారు. ర్యాలీ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్,రసాయన రంగులు లేకుండా అట్టముక్కలు,కాగితాలు, సహజ రంగులతో విద్యార్ధులను మేకప్ చేసిన విధానం బాగుందంటూ స్కూల్ యాజమాన్యంను అభినందించారు శ్రీనివాస్.


ప్రకృతిని కాపాడి తమ భవిష్యత్ ను కాలుష్యం నుండి కాపాడాలంటూ ర్యాలీలో విద్యార్ధులు నినదించారు.


ర్యాలీ వీధుల్లోని ప్రజలకు తులసి,ఉసిరి లాంటి ఔషధ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో ఊ కిడ్జ్ స్కూల్ యాజమాన్యం 

Nc Venkat Acharya, Nc Krishna kumari, MANOHAR, JYOTHIRAMAI,

Teachers

Vaishnavi, Swathi, Mounica, Purnima,

Bhavya, Bhavana, విద్యార్ధులు, చిన్నారులు పాల్గొన్నారు









Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh MOULDS in Hyderabad

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.

IVF Telangana Environment Protection Council (TEPC) ఛైర్మన్ గా భావన శ్రీనివాస్ నియామకం.