జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ వేడుకలు

తలుపు తట్టి మేల్కొలుపుదాం!! జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ వేడుకలు బి.ఎన్.రెడ్డి డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని... భూమిని కాపాడుకుందాం! భూమి పైన ఉన్న చెట్టును కాపాడుకుందాం!! చెట్లను ఆధారంగా చేసుకున్న పశుపక్షులను కాపాడుకుందాం!!! అనే గొప్ప ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు మరియు విద్యార్థినీ విద్యార్థులు గడపగడపకు "తలుపు తట్టి మేలుకొలుపుదాం" కార్యక్రమాల్లో... ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల భూమాతకు కలిగేటువంటి నష్టాలను వివరిస్తూ వాటి స్ధానంలో అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ వస్తువులను ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత తరుణంలో పల్చబడి పోతున్న ఓజోన్ పొర, రకరకాల క్యాన్సర్ కారక ఆహార పదార్థాలు, వ్యవసాయ పొలాల్లో వాడుతున్న రసాయనాలు, సెల్ ఫోన్ రేడియేషన్, నీటిని అధికంగా వాడడం, భూ గర్భ జలాలు అడుగంటి పోవడం, విద్యుత్,పెట్రోల్ లాంటి వనరుల దుర్వినియోగం తదితర అంశాలతో పాటు భూసారాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించవలసినటువంటి సహజ పద్ధతులను వివరిస్తూ ప్రతి ఇంట్లో వ్యక్తుల...