Posts

Showing posts from 2026

పర్యావరణ హితంగా శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ

Image
 జాగృతి అభ్యుదయ సంఘం, వాసవి క్లబ్ మరియు వాసవి వనిత సంయుక్త ఆధ్వర్యంలో సాహెబ్ నగర్  NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ తేదీ 04/04/2026 శనివారం ఉదయం 9:00 గo. లకు జరిగినది. కార్యక్రమంలో అల్పాహారం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మరియు టీ స్టీల్ గ్లాసులలలో ఇవ్వడం జరిగింది.  పూలు, పూజా సామాగ్రి మొత్తం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులలో కాకుండా తిరిగి వాడుకునే సంచులలోనే క్యారీ చేయడం జరిగింది.  కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, దాతలకు చేనేత కండువాలను శాలువాగా కప్పి తిరిగి వాడుకునే బ్యాంబూ, స్టీల్, మట్టి వాటర్ బాటిల్స్, బట్ట సంచులను, నాచురల్ రూమ్ ఫ్రెషనర్ లను, విద్యార్థులకు పండ్లను  ఇవ్వడమైనది. కార్యక్రమం అంతా పర్యావరణహితంగా జరిగినది.

జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన

Image
 *జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన* 👉 వాడవాడలా ఈ ప్రదర్శనలు జరగాలి. ప్రజల కోరికగా ప్రజా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సంకేతాలు అందాలి... భావన శ్రీనివాస్.                                            మూడవ ప్రపంచ యుధ్ధ పరిణామాల నేపధ్యంలో ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధం వలన ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రపంచ వినాశనానికి, దరిద్రానికి, కరువు కాటకాలకు దారి తీస్తాయని "యుద్ధం వద్దు ! శాంతి ముద్దు" అని పిలుపునిస్తూ జాగృతి అభ్యుదయ సంఘం  ఆధ్వర్యంలో ఇంజాపూర్ - సాహెబ్ నగర్ డివిజన్ ప్రధాన రహదారుల్లో ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం...                                                                                    ...

ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత చుక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రం --- వనస్థలిపురం నూతన సీఐ రవిబాబు

Image
 *ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత:* 👉*చుక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రం* ....*వనస్థలిపురం నూతన సీఐ మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవంను  పురస్కరించుకుని జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన ఈరోజు శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీ గణేష్ మండపం వేదికగా నిర్వహించిన కృత్రిమ పిచ్చుకల గూళ్లు, విత్తనాలు మరియు నీటి మూకుడులు, వస్త్ర సంచులు, తులసి మొక్కల ఉచిత పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం పలువురకు స్ఫూర్తిదాయకమని  వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్  రవిబాబు కొనియాడారు. ఈ కార్యక్రమానికి  ఎస్ఐ రవి నాయక్ గారితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.                                                                               *ప్రసంగంలోని ముఖ్యాంశాలు:*  *పర్యావరణ స్పృహ:* ప్రకృతిని కాపాడుకోవడంలో భావన శ్రీనివాస్ గారి కృషి అభినందనీయం...

ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Image
 *ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు* 👉 జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, పరిసర కాలనీల మహిళలు.      సంక్రాంతి సంబరాల్లో భాగంగా సైన్స్ తో ముడిపడి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలని సాయి మందిరం వేదికగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతితోపాటు దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో  నిన్న సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచాగ్నుల జయశ్రీ, జీని శ్రీలత, గాయత్రి గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో మొదటి బహుమతి ₹ 3000/- నగదును శ్రావ్య, రెండవ బహుమతి ₹ 2000/- పార్వతి, మూడవ బహుమతి ₹ 1000/- సహస్ర లు గెల్చుకోగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక, ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 3వేలు కాలనీ పెద్దలు దుబాయ్ రాజా, మూడవ బహుమతి 1వెయ్యిని SKN కళాక్ష...

భావన శ్రీనివాస్ చే LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ

Image
 భావన శ్రీనివాస్ చే 👉LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ  👉అన్న ప్రసాద వితరణ  LIC ఆనబత్తుల సత్యనారాయణ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా కాలనీ ప్రముఖులతో కలిసి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం భావన శ్రీనివాస్ ఆర్ధిక సహకారంతో సాయి మందిరం కమిటి మహిళలు షుమారు 350మంది సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ, మిఠాయిలు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, సాయి మందిరం ఛైర్మన్ శ్రీమతి మారుతమ్మ, దుబాయ్ రాజా, శ్రీమతి భవాని, మనోజ్ గౌరి శెట్టి, దయాకర్ ముదిరాజ్, రమేష్, కుమారస్వామి, మధుసూధన్ రెడ్డి, వీరచంద్రరావు, శివ ,రేణుక, చంద్రశేఖర్, వెంకటేష్ గౌడ్, సురేందర్, భిక్షమయ్య, శ్రవణ్ కుమార్,  సరస్వతి, పద్మజ, విమల్ బన్సాల్, నరసింహ, మల్లయ్య, శ్రీరాములు గౌడ్, రవీందర్, నాగిరెడ్డి, రాంబాబు, మహిళలు పాల్గొన్నారు. - భావన శ్రీనివాస్  జాగృతి అభ్యుదయ సంఘం.

అన్నదానం - మహాదానం

Image
2026 జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్  ఆధ్వర్యంలో బి.యన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ  సాయి మందిరం వేదికగా 350 మందికి అన్నదానం చేయడం జరిగింది