Posts

మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం

Image
మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం  👉 రిబ్బన్ కత్తిరించి మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన వనస్ధలిపురం CI శ్రీనివాసులు 👉జల వనరులను పొదుపుగా వాడుకుంటామంటూ సభికుల ప్రమాణం ఎండాకాలం ప్రయాణీకుల దాహార్తిని తీర్చే సదాలోచనతో సామాజిక కార్యకర్తలైన భావన శ్రీనివాస్(JAS Chairman), పంది కృష్ణ(శ్రీ వెంకటేశ్వర కాలని అద్రక్షులు), యాదగిరి రావు(విప్ర సేవా సమితి అధ్యక్షులు), వంశీకృష్ణ(టెక్కీ రైడ్ సభ్యులు), సురేందర్(సాఫ్ట్వేర్), లక్ష్మీ శ్రీ (సంతోషి మాత టెంపుల్ ఛైర్మన్)లు కలిసి బి.ఎన్.రెడ్డి తూర్పు శివారు కాలనీవాసుల సౌకర్యార్థం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ విప్ర సేవా సమితి ప్రక్కన, వెంకటేశ్వర కాలని సంతోషి మాతా దేవాలయ కమాన్ ఎదురుగా ఉన్న రహదారి నందు మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడమైనది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనస్ధలిపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ హితం కోసం స్వచ్చందంగా పాటుపడుతున్న ఇలాంటి కొందరి కారణంగానే సమాజం ఇంకా మనుగడ సాగిస్తుందని, ఎండ వేడికి అల్లాడుతూ, దాహంతో తడి ఆరిపోయే గొంతుకలకు చల్లటి మినరల్ వాటర్ ను బాట స...

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025

Image
 మార్చి 20  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుక గూళ్ళు, నీళ్ళ చిప్పలు, గింజలు, డాగ్ బౌల్స్, క్లాత్ బ్యాగ్స్ పంపిణీ. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2025

Image
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ వివేకానంద విద్యా వికాస్ కేంద్రంలో  బాల బాలికలు పాల్గొని "బాల్య వివాహాలను రూపుమాపటం" కోసమై రంగస్థల నటుడు శాంతారావు గారు రూపొందించిన మల్లె మొగ్గ అనే నాటిక ప్రదర్శించారు. పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ 25శాతంగా జరుగుతున్న బాల్య వివాహాల వలన శారీరకంగాను, ఆర్ధికంగాను, కుటుంబ పరంగానూ ఎదురయ్యే కష్టనష్టాలను ఆలోచింప చేసే విధంగా హృద్యంగా ప్రదర్శించిన నాటికను పిల్లలు మరియు  పెద్దలు ఆసక్తిగా తిలకించారు.  కార్యక్రమానికి వివేకానంద విద్యా వికాస్ కేంద్రం,  జాగృతి అభ్యుదయ సంఘం, లైట్ ఆర్గనైజేషన్ మరియు వనమాలి సంస్థ వారు సహకారం అందించారు.       లైట్ ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ పిల్లలందరూ ఆడ మగ అందరూ సమానమేనని, ఎక్కువ తక్కువల తారతమ్యాలు ఉండకూడదు అని అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంతో పోలిస్తే మహిళలు చాలా చైతన్య వంతులైనారని, కుటుంబానికే కాకుండా సమాజంలోకొచ్చి రాజకీయ పదవుల్లో కూడా రాణిస్తున్నారని, మహిళలు పురుషులు ఒకరికొకరు  సమన్వయం చేసుకుంటూ తమ...

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.

Image
శుభం జరిగే(దే) శుభకార్యం సామాజిక శ్రేయోభిలాషులు లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations సచివాలయ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో.. ఆరోగ్య ప్రియంగా  గ్రీన్ కేక్ (watermelon)cutting వేడుకలు  ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు👌

04/02/2025 బి.ఎన్.రెడ్డి డివిజన్ గౌ.కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి గారి జన్మదిన వేడుకలు..

Image
  అట్టహాసంగా బి.ఎన్.రెడ్డి డివిజన్ గౌ.కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి గారి జన్మదిన వేడుకలు.. 👉 శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కదిలి వెళ్ళిన గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు  👉గ్రీన్ కేక్ (watermelon)కట్ చేసి వేడుకలు ప్రాంభించిన లచ్చిరెడ్డి  👉తన డివిజన్ లోని కాలనీలవాసులకు క్యాన్సర్ రాకూడదనే సదాలోచనతో  ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచి పలువరకూ ఆదర్శంగా నిలిచిన కార్పోరేటర్ 👌 Long Live Lachi Reddy Sir 🍉🙌💐

ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025.

Image
రాజ్యాంగ చట్టాలను గౌరవించడమే నిజమైన దేశభక్తికి నిదర్శనం  దేశ భక్తి గీతాల పోటీలు - విజేతలకు బహుమతులు పంపిణీ జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకుని బి.ఎన్.రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు "దేశభక్తి గీతాలాపన పోటీలు" నిర్వహించి విజేతలు - హారిక,శివాని, శృతి, మహాలక్ష్మి, సిద్దిక్ష లకు బహుమతులు పంపిణీ చేయడమైనది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేష్ గారు మాట్లాడుతూ ఈ పోటీలతో బాల్య దశలోనే విద్యార్ధుల్లో దేశభక్తి భావన పెరుగుతుందని, బాధ్యతాయుతమైన భారతీయులుగా ఎదగడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి తమ పాఠశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందంటూ జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ కు HM దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీల విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులకు భావన శ్రీనివాస్ పర్యావరణ హిత బట్టసంచులు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. చిన్న పెద్ద, కుల మత, పర తమ భేదం భావం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు తన స్వేచ్ఛను ప్రకటించుకునే విధంగా రూపొందించిన మన రాజ్యాంగాన్ని...

జాగృతి అభ్యుదయ సంఘం ఆద్వర్యంలో సంక్రాంతి పర్యావరణ ముగ్గుల పోటీలు. 2025

Image
  సందేశాత్మకంగా ముగ్గుల పోటీలు   జాగృతి అభ్యుదయ సంఘం, SKN కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ VOO SCHOOL వేదికగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 👉 SAVE EARTH  👉 Respect Farmer  అంటూ వేసిన పలు సందేశాత్మక ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. పోటీల అనంతరం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(AIDWA) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మల్లు లక్ష్మీ గారి బృందం న్యాయం నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు మరియు పాల్గొన్న వారందరికీ "మొదటి ముద్ద" వారి విలువైన బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటినుంచి బైటికొచ్చి మహిళలు ముగ్గులు వేయడం వలన కలివిడితనంతో స్నేహభావం పెరుగుతుందని, నెల రోజులపాటు నడుం వంచి శారీరక శ్రమతో నిత్యం ముగ్గులు వేయడంతో చలి తాలూకు బద్దకం పోయి చురుకుదనం పెరుగుతుంది అని, తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినట్లు అవుతుందని అని అన్నారు. మహిళా హక్కుల కోసం, వారిపై జరుగుతున్న అనేక రకాల దాడులను అడ్డుకునేందుకు AIDWA దశాబ్దాలుగా పోరాడి అనేక...