అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2025


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ వివేకానంద విద్యా వికాస్ కేంద్రంలో  బాల బాలికలు పాల్గొని "బాల్య వివాహాలను రూపుమాపటం" కోసమై రంగస్థల నటుడు శాంతారావు గారు రూపొందించిన మల్లె మొగ్గ అనే నాటిక ప్రదర్శించారు.

పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ 25శాతంగా జరుగుతున్న బాల్య వివాహాల వలన శారీరకంగాను, ఆర్ధికంగాను, కుటుంబ పరంగానూ ఎదురయ్యే కష్టనష్టాలను ఆలోచింప చేసే విధంగా హృద్యంగా ప్రదర్శించిన నాటికను పిల్లలు మరియు  పెద్దలు ఆసక్తిగా తిలకించారు.

 కార్యక్రమానికి వివేకానంద విద్యా వికాస్ కేంద్రం,  జాగృతి అభ్యుదయ సంఘం, లైట్ ఆర్గనైజేషన్ మరియు వనమాలి సంస్థ వారు సహకారం అందించారు.

      లైట్ ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ పిల్లలందరూ ఆడ మగ అందరూ సమానమేనని, ఎక్కువ తక్కువల తారతమ్యాలు ఉండకూడదు అని అన్నారు.

జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంతో పోలిస్తే మహిళలు చాలా చైతన్య వంతులైనారని, కుటుంబానికే కాకుండా సమాజంలోకొచ్చి రాజకీయ పదవుల్లో కూడా రాణిస్తున్నారని, మహిళలు పురుషులు ఒకరికొకరు  సమన్వయం చేసుకుంటూ తమ ఇంటికి సమాజానికి దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని సందేశం ఇచ్చారు.


 




Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.