జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన
*జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన* 👉 వాడవాడలా ఈ ప్రదర్శనలు జరగాలి. ప్రజల కోరికగా ప్రజా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సంకేతాలు అందాలి... భావన శ్రీనివాస్. మూడవ ప్రపంచ యుధ్ధ పరిణామాల నేపధ్యంలో ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధం వలన ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రపంచ వినాశనానికి, దరిద్రానికి, కరువు కాటకాలకు దారి తీస్తాయని "యుద్ధం వద్దు ! శాంతి ముద్దు" అని పిలుపునిస్తూ జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఇంజాపూర్ - సాహెబ్ నగర్ డివిజన్ ప్రధాన రహదారుల్లో ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం... ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక విశ్లేషకులు కె.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో ప్రజలు తమ తమ నిత్య జీవితంలో పౌర సౌకర్యాల కోసం సుస్థిర జీవనం గడపడం కోసం అనేకానేక పోరాటాలు చేసే ఈ సమయంలో మరో మూడో ప్రపంచ యుద్ద పరిస్థితి నెలకొంది. ఇటువంటి స్ధితిని అమెరికా దాని మిత్ర పక్షం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, మరోపక్క ఉక్రెయిన్ - రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా నడుస్తున్న యుద్ధం వల్ల కేవలం ఆ దేశాలే కాకుండా ప్రపంచంలోని ఇప్పుడిప్పుడే ఆ...