హరిత శబరి యాత్ర వస్త్ర సంచుల పాత్ర జాగృతి అభ్యుదయ సంఘం.2025


అయ్యప్ప స్వాముల 40 రోజుల దీక్ష 365 రోజుల ఆరోగ్యానికి బాట





👉ఏక వినియోగ ప్లాస్టిక్ నియంత్రణలో శబరిమలై అయ్యప్ప దేవాలయ కమిటీని మన దేవాలయ కమిటీలు ఆదర్శంగా తీసుకోవాలి.. వనస్ధలిపురం SI రవినాయక్.

👉 అయ్యప్ప స్వాముల 40రోజుల దీక్ష 365 రోజుల ఆరోగ్యానికి బాట కావాలి.. భావన శ్రీనివాస్.

      సాహెబ్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శబరి మలై యాత్రకు వెళ్తున్న అయ్యప్పలకు జాగృతి అభ్యుదయ సంఘం వస్త్ర సంచులను పంపిణీ చేసింది. పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరైన వనస్ధలిపురం SI రవి నాయక్ మాట్లాడుతూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం కారణంగానే ప్రాణాంతక వ్యాధులు తెచ్చే కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయని, తాజాగా HMPV వైరస్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రకృతి పరిరక్షణ తోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందని, ఏటా శబరిమలై యాత్రకు వెళ్ళే లక్షలాది అయ్యప్ప స్వాములకు, అడవి జంతువులకు అసౌకర్యం, అనారోగ్యం దరి చేరకూడదనే ఆలోచనతో కేరళ అయ్యప్ప దేవస్ధాన కమిటి పంబ దగ్గరనుండే కొండ మీదకు ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, క్యారిబ్యాగులు వెళ్ళకుండా కట్టడి చేస్తుందని, వారి ఈ మంచి ప్రయత్నాన్ని స్ధానిక దేవాలయ కమిటీలు కూడా ఆదర్శంగా తీసుకుని కాలుష్య రహిత సమాజానికి బాటలు వేయాలని, అందుకు భక్తుల సహకారం కూడా ఉండాలన్నారు.

     వినియోగదారులకు రుచితో పాటు  ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదాలోచనతో ఏక వినియోగ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా జాగృతి అభ్యుదయ సంఘం వారి మొదటి ముద్ద యాజమాన్యం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అని పృథ్వీరాజ్ గురుస్వామి అన్నారు.

కార్యక్రమంలో గురుస్వాములు నాగరాజు,దాస్, సురేష్, ధన్ పాల్, రాకేష్, కన్నె స్వాములు, అయ్యప్పలు, సాయి, ఉపేందర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు..భావన శ్రీనివాస్, ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.


Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh MOULDS in Hyderabad

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.

IVF Telangana Environment Protection Council (TEPC) ఛైర్మన్ గా భావన శ్రీనివాస్ నియామకం.