ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు
*ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు* 👉 జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, పరిసర కాలనీల మహిళలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సైన్స్ తో ముడిపడి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలని సాయి మందిరం వేదికగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతితోపాటు దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో నిన్న సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచాగ్నుల జయశ్రీ, జీని శ్రీలత, గాయత్రి గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో మొదటి బహుమతి ₹ 3000/- నగదును శ్రావ్య, రెండవ బహుమతి ₹ 2000/- పార్వతి, మూడవ బహుమతి ₹ 1000/- సహస్ర లు గెల్చుకోగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక, ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 3వేలు కాలనీ పెద్దలు దుబాయ్ రాజా, మూడవ బహుమతి 1వెయ్యిని SKN కళాక్ష...