Posts

Showing posts from January, 2025

ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025.

Image
రాజ్యాంగ చట్టాలను గౌరవించడమే నిజమైన దేశభక్తికి నిదర్శనం  దేశ భక్తి గీతాల పోటీలు - విజేతలకు బహుమతులు పంపిణీ జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకుని బి.ఎన్.రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు "దేశభక్తి గీతాలాపన పోటీలు" నిర్వహించి విజేతలు - హారిక,శివాని, శృతి, మహాలక్ష్మి, సిద్దిక్ష లకు బహుమతులు పంపిణీ చేయడమైనది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేష్ గారు మాట్లాడుతూ ఈ పోటీలతో బాల్య దశలోనే విద్యార్ధుల్లో దేశభక్తి భావన పెరుగుతుందని, బాధ్యతాయుతమైన భారతీయులుగా ఎదగడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి తమ పాఠశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందంటూ జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ కు HM దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీల విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులకు భావన శ్రీనివాస్ పర్యావరణ హిత బట్టసంచులు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. చిన్న పెద్ద, కుల మత, పర తమ భేదం భావం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు తన స్వేచ్ఛను ప్రకటించుకునే విధంగా రూపొందించిన మన రాజ్యాంగాన్ని...

జాగృతి అభ్యుదయ సంఘం ఆద్వర్యంలో సంక్రాంతి పర్యావరణ ముగ్గుల పోటీలు. 2025

Image
  సందేశాత్మకంగా ముగ్గుల పోటీలు   జాగృతి అభ్యుదయ సంఘం, SKN కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ VOO SCHOOL వేదికగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 👉 SAVE EARTH  👉 Respect Farmer  అంటూ వేసిన పలు సందేశాత్మక ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. పోటీల అనంతరం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(AIDWA) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మల్లు లక్ష్మీ గారి బృందం న్యాయం నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు మరియు పాల్గొన్న వారందరికీ "మొదటి ముద్ద" వారి విలువైన బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటినుంచి బైటికొచ్చి మహిళలు ముగ్గులు వేయడం వలన కలివిడితనంతో స్నేహభావం పెరుగుతుందని, నెల రోజులపాటు నడుం వంచి శారీరక శ్రమతో నిత్యం ముగ్గులు వేయడంతో చలి తాలూకు బద్దకం పోయి చురుకుదనం పెరుగుతుంది అని, తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినట్లు అవుతుందని అని అన్నారు. మహిళా హక్కుల కోసం, వారిపై జరుగుతున్న అనేక రకాల దాడులను అడ్డుకునేందుకు AIDWA దశాబ్దాలుగా పోరాడి అనేక...

హరిత శబరి యాత్ర వస్త్ర సంచుల పాత్ర జాగృతి అభ్యుదయ సంఘం.2025

Image
అయ్యప్ప స్వాముల 40 రోజుల దీక్ష 365 రోజుల ఆరోగ్యానికి బాట 👉ఏక వినియోగ ప్లాస్టిక్ నియంత్రణలో శబరిమలై అయ్యప్ప దేవాలయ కమిటీని మన దేవాలయ కమిటీలు ఆదర్శంగా తీసుకోవాలి.. వనస్ధలిపురం SI రవినాయక్. 👉 అయ్యప్ప స్వాముల 40రోజుల దీక్ష 365 రోజుల ఆరోగ్యానికి బాట కావాలి.. భావన శ్రీనివాస్.       సాహెబ్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శబరి మలై యాత్రకు వెళ్తున్న అయ్యప్పలకు జాగృతి అభ్యుదయ సంఘం వస్త్ర సంచులను పంపిణీ చేసింది. పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరైన వనస్ధలిపురం SI రవి నాయక్ మాట్లాడుతూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం కారణంగానే ప్రాణాంతక వ్యాధులు తెచ్చే కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయని, తాజాగా HMPV వైరస్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రకృతి పరిరక్షణ తోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందని, ఏటా శబరిమలై యాత్రకు వెళ్ళే లక్షలాది అయ్యప్ప స్వాములకు, అడవి జంతువులకు అసౌకర్యం, అనారోగ్యం దరి చేరకూడదనే ఆలోచనతో కేరళ అయ్యప్ప దేవస్ధాన కమిటి పంబ దగ్గరనుండే కొండ మీదకు ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, క్యారిబ్యాగులు వెళ్ళకుండా కట్టడి చేస్తుందని, వారి ఈ మంచి ప్రయత్నాన్ని స్ధా...