December 5 "World Soil Day"2024

నేలను పాడు చేసుకుంటే మీరు పంటలు ఎక్కడ పండిస్తారు ? 👉 భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా భావన శ్రీనివాస్ December 5 "World Soil Day" సందర్భంగా GHMC స్వచ్ఛభారత్ మిషన్ పిలుపు మేరకు జాగృతి అభ్యుదయ సంఘం మరొక ముందడుగు వేసింది. 'నేటి బాలలే రేపటి పౌరులు' అన్న పెద్దల మాటలను నమ్ముతూ విద్యార్ధి దశ నుండే పిల్లల్లో "నేల" ప్రాముఖ్యత/అవసరం గురించి, నేలతల్లి కాలుష్యం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, పరిష్కార మార్గాల గురించి విద్యార్థులకు చెప్పి వారిని చైతన్య పరచారలనే సదాశయంతో పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల HMగారి ఆహ్వానం మేరకు వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశమునకు భావన శ్రీనివాస్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. *కన్న తల్లి 9నెలలు మోస్తే నేలతల్లి 90సం.లు మొయ్యాలని, అటువంటి నేలమ్మ గర్భంలోకి వ్యవసాయం పేరుతో హానికారక కృత్రిమ ఎరువులు, విష రసాయనాలు చొప్పించడం వలన నేల సారం కోల్పోయి కొన్నాళ్ళకు చౌడు భూములుగా తయారై శాశ్వతంగా జీవాన్ని కోల్పోతుందని, వాటి స్ధానంలో గోమయం, గోమూత్రం తదితర మిశ్రమ...